18 July, 2026 | 1:15 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

కుప్పకూలిన విమానం

12-06-2024 12:40 AM

మలావీ ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం

లిలోంగ్వే (మలావీ), జూన్ 11: ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు  9 మంది అధికారుల ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. విమానం కోసం మాలావీ సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. చివరకు విమాన శకలాలు గుర్తించారు. అందులో ఎవరూ ప్రాణాలతో లేరని ఆ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడించారు.

మలావీ ఉపాధ్యక్షుడు, మరో తొమ్మిది మంది ప్రయాణిస్తున్న విమానం సోమవారం అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయల్దేరిన ఆ విమానం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానా శ్రయంలో దిగాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగొద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలో తిరిగి వెళ్తుండగా రాడార్‌తో విమానం సంబంధాలు తెగిపోయాయి. విమానం కోసం వందల మంది సైనికులు, పోలీసులు ముమ్మరంగా గాలించారు. చివరకు పర్వత ప్రాంతాల్లో కూలిపోయినట్టు గుర్తించారు.