రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్, వైస్ చైర్మన్ లకు ఘన సన్మానం
14-01-2026 08:58 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ అధ్యక్షులు శ్రీ రాయప్రోలు శ్రీరామయ్య శర్మ, వైస్ చైర్మన్ బల్దూరి అంజయ్యను బుధవారం కమిటీ సభ్యులు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సంక్రాంతి పండగ పురస్కరించుకొని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు




