calender_icon.png 3 November, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీతో పరిపాలన చేస్తున్న మంత్రి ఉత్తం, ఎమ్మెల్యే పద్మావతి దంపతులపై విమర్శలు అర్ధరహితం

02-11-2025 07:32:42 PM

మాజీ ఎమ్మెల్యే బొల్లం ఆరోపణలపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు, కాంగ్రెస్ నాయకులు

కోదాడ: నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి లేనని నిజాయితీతో పరిపాలన చేస్తున్న మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతిలను విమర్శించే స్థాయి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు లేదని, ఈ విషయమై బొల్లంతో బహిరంగ చర్చకు సిద్ధమని కోదాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు అన్నారు ఆదివారం తన నివాసంలో మంత్రి ఉత్తం ఎమ్మెల్యే పద్మావతిలపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన నిరాధార అసత్య ఆరోపణలను ఖండిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా ఉండే ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గంలో ల్యాండు సాండ్ లిక్కర్ దందాలపై కమిషన్లు బహిరంగంగా తీసుకున్నది ఎవరో కోదాడ ప్రజలందరికీ తెలుసు అన్నారు.

కోదాడ నియోజకవర్గంలో జరిగిన అవినీతిపై అభివృద్ధిపై తాము చర్చలకు సిద్ధమేనని టైం ప్లేస్ డిసైడ్ చేసుకోవచ్చని సవాలు విసిరారు. కోదాడ నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఎత్తిపోతల పథకాలకు రోడ్లకు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ వైద్యశాల  ఆర్టీసీ బస్టాండ్కు అభివృద్ధి చేస్తున్న విషయం కనిపించడం లేదా అన్నారు. ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు, పారా వెంకటేశ్వర్లు, నెమ్మది దేవమని, వంగవీటి శ్రీనివాసరావు, కర్రీ సుబ్బారావు, ఎండి ఖాజా మొయినిద్దీన్, రావెళ్ళ కృష్ణారావు వంటి పులి శ్రీనివాస్, మల్లు వెంకటరెడ్డి మల్లు నాగిరెడ్డి, వెంకటేశ్వరరావు మేకపోతుల సత్యనారాయణ, కందరపోయిన పెద్ద వేలాద్రి, బొలిశెట్టి రాము, చిత్తులూరి భీమయ్య, మైలారం శెట్టి భాస్కర్ షేక్ ఇక్బాల్, లైటింగ్ ప్రసాద్ వెంకటేశ్వరరావు, అవిరే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.