05-06-2025 04:57:22 PM
పత్తి విత్తనాలు దళారుల వద్ద కొని రైతులు మోసపోవద్దు...
మునుగోడు (విజయక్రాంతి): రైతులు సాగు చేసే భూమిలో పంట మార్పిడి చేయడంతో భూమి సారవంతం పెరుగుతుందని మండల వ్యవసాయ అధికారిని సరస్వతి పద్మజ(Mandal Agriculture Officer Saraswati Padmaja) అన్నారు. గురువారం పలివెల గ్రామం రైతువేదికలో పంట మార్పిడి విధానంపై రైతులకు ఆమె అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రతి రైతు విత్తనాలు కొనేటప్పుడు బిల్లులు కచ్చితంగా తీసుకోవాలని బిల్లులపై ముద్రించిన వివరాలు విత్తన ప్యాకెట్ పైన ముద్రించినవా లేదా చూసుకోవాలని తెలిపారు. సమృద్ధిగా వర్షాలు పడిన తర్వాత భూమిలో విత్తనాలు వేసుకోవాలని, ప్రేమ శాతం లేనప్పుడు విత్తనాలు విత్తుకోకూడదు అని తెలియ చేసినారు.
భూమి ఉన్న ప్రతి రైతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. రైతు పట్టా పాస్ బుక్కు జిరాక్స్, ఆధార్ కార్డు నెంబర్ తో పాటు ఆధార్కు లింకు ఉన్న ఫోన్ నెంబరును వ్యవసాయ విస్తరణ అధికారి వద్దకు తీసుకువచ్చి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవలెను అన్నారు. సేంద్రియ వ్యవసాయం చేసుకుని ప్రతి రైతు వారి ఆరోగ్యం కాపాడుకోవాలి అని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి నిఖిల్ కుమార్, గ్రామ రైతులు పాల్గొన్నారు.