calender_icon.png 7 June, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతో సాధ్యం

05-06-2025 05:00:51 PM

సహకార సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు

తుంగతుర్తి (విజయక్రాంతి): పేద ప్రజల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని డీసీసీబీ డైరెక్టర్ తుంగతుర్తి పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు(PACS Chairman Gudipati Saidulu) అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో ధర్మారపు సునీల్ కుమార్ రాధిక వివాహ వేడుకలో పాల్గొని, ఆశీర్వదించి, మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అహర్నిశలు పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ప్రస్తుతం నియోజకవర్గంలో 1400 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా సూర్యాపేట జిల్లాలో 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండగడుపుల ఎల్లయ్య యాకయ్య మల్లయ్య కర్ణాకర్ డీజే ఆఫ్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి శ్రీనివాస్ ఉండగాని రాము గుండ గాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.