16-06-2025 11:52:47 PM
ఖమ్మం (విజయక్రాంతి): కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్, సేవా, సుపరిపాలన, 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల, సుపరిపాలన పైన రచ్చ బండ కార్యక్రమం నిర్వహించామని బీజేపీ అర్బన్ మండల అధ్యక్షుడు వాగాదాని రామకృష్ణ(BJP Urban Mandal President Vagadani Ramakrishna) తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని సెవెంత్ డివిజన్ సెంటర్లో నిర్వహించిగా ప్రోగ్రాం ఇన్చార్జి ఆకుల నాగేశ్వరరావు గౌడ్ పాల్గొని మాట్లాడుతూ... నరేంద్ర మోడీ 11 సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని నాలుగవ ఆర్థిక వ్యవస్థగా తయారుచేసి ఈనాడు దేశంలో మౌలిక వసతులు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి దేశంలో మారుమూల పల్లెలను తీర్చిదిద్ది గ్రామాల అభివృద్ధికి పాటుపడిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
పీఎం విశ్వకర్మ, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల గ్యాస్, కిసాన్ సమ్మన్, గ్రామీణ సడక్ యోజన, ముద్ర లోన్, సుకన్య సమృద్ధి యోజన, ఈశ్రము కార్డు,ఉచిత రేషన్ బియ్యం, గ్రామీణ ఉపాధి, రైతు వేదికలు, జాతీయ రహదారులు, అటల్ బీమా యోజన, జన్ దాన్ ఖాతాలు, డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, బాలింతలకు పౌష్టికాహారం, గ్రామాలలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, చెత్త సేకరణ, వీధి దీపాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, విమానాశ్రయాలు నిర్మాణం ఏర్పాటు చేశారన్నారు. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ, వంద పడకల ఆసుపత్రి,అత్యంత ఆధునీకరమైన రైల్వే స్టేషన్ నిర్మాణం, యూనివర్సిటీలు నిర్మాణం, ప్రతి రాష్ట్రానికి ఎయిమ్స్ ను ఏర్పాటు చేయటం, ఐఐటి. ఐఐఐ ఐటీ, ఏర్పాటు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని దినదినాభివృద్ధి చేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు నరేంద్ర మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, రేఖ సత్యనారాయణ యాదవ్, దొంగల నాగరాజు, కే అంజన్న, ఉపేందర్, పల్లపు వెంకన్న, రవీంద్రాచారి, రాము, హుస్సేన్, కే వేణు, కె రాము , గోల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.