15 July, 2026 | 6:23 PM

Breaking News

నగరంలో రూ.1.5 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులకు శంకుస్థాపన   •   తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలి   •   వాసవి వరల్డ్ విద్యార్థి ప్రతిభ   •   తాడిచర్ల–2 బ్లాక్ విజయోత్సవంలో సింగరేణి డైరెక్టర్ పి&పి కె.వెంకటేశ్వర్లు   •   ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమస్యలు చెప్పండి   •   మహంకాళి బోనాలకు రూ.1.50 లక్షల విరాళం ఇచ్చిన మైనారిటీ నాయకులు రఫీ   •   నెన్నెల పోలీస్ స్టేషన్‌ను డీసీపీ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ   •   ఆమ్దాపూర్ న్యూ పాఠశాల విద్యార్థులకు 135 స్కూల్ బ్యాగుల పంపిణీ   •   విద్యుత్ సమస్యల పరిష్కారం చేస్తాం..   •   నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు   •  

తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలి

15-07-2026 06:18 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ప్రస్తుత వ్యవసాయ సీజన్లో రైతులు తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలని జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ కోరారు.జగన్నాధపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ కుంజా వినోద్, వ్యవసాయ విస్తరణ అధికారి బి.రమేష్ రైతులకు ముఖ్య సూచనలు చేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది ఎల్ నీనో ప్రభావం కారణంగా సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అనంతరం  స్థానికంగా ఉన్న ఎరువుల దుకాణం సందర్శించి వాతావరణ శాఖ అధికారుల సూచనలతో నాణ్యమైన విత్తనాలు,ఎరువులు అందించాలని వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసేలా రైతులను చైతన్య పరచాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మండల బి ఎల్ ఎ కోఆర్డినేటర్ సురభి రాజేష్,రైతులు పాల్గొన్నారు.