calender_icon.png 16 June, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే వంతెనకు రూ. 1 కోటి 70లక్షలు నిధులు విడుదల

16-06-2025 01:35:22 AM

ఘట్ కేసర్, జూన్ 15 : ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే వంతెన పనులకు రూ.1 కోటి 70 లక్షలు నిధులు విడుదల చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు, అందుకు సహకరించిన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి లకు మున్సిపల్ మా జీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

ఘట్ కేసర్  పట్టణ నాయకులు అందరు పార్టీలకి అతీతంగా వంతెన నిర్మాణానికి సహకరిస్తే అతి త్వరలో వంతెన పనులు పూర్తి చేసుకోవచ్చు అన్నారు. అదేవిధంగా పట్టణ పరిధిలో ఉన్న సమస్యలు అ న్ని కూడా కలిసి పరిష్కారం చేసుకుకోవాలని, కొందరు నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలందరికీ తెలుసు అని ఇప్పుడు నిర్మాణం పనులు వేగవంతం చేసేది ఎవరో కూడా ప్రజలు గమనిస్తున్నారని కావున ప్రజాప్రతినిధులు, బాలాజీ నగర్, కొండాపూర్ ప్రజలు, ఇలాగే కొద్ది రోజులు సహకరిస్తే మన ఫ్లై ఓవర్ ప్రారంభం అవుతుందన్నారు.