16-06-2025 01:36:58 AM
రాజేంద్రనగర్, జూన్15: హిందూ యువకులపై అకారణంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. మైలార్దేవపల్లి డివిజన్ లక్ష్మిగూడతో పాటు అత్తాపూర్ ప్రాంతంలో బక్రీద్ మరుసటి రోజు జంతువుల కళేబరాలను, అదేవిధంగా గోవులను తరలిస్తున్న తరలిస్తుండగా అడ్డుకున్న హిందూ యువకులపై అకారణంగా కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ ఆదివారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, గోరక్ష, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ డిసిపి ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. ఓ వర్గానికి చెందిన యువకులపై ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని మండిపడ్డారు. కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చట్ట వ్యతిరేకంగా జంతు కళేబరాలను తరలిస్తున్న వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డిసిపి అందుబాటులో లేకపోవడంతో ఏసీపి శ్రీనివాస్ కు వినతి పత్రం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు రమేష్ బాబు, గోరక్ష ప్రముక్ విశాల్ ప్రసాద్, విశాల్ సునాకర్, భానుమూర్తి, దీపక్ యాదవ్, ముకేష్ యాదవ్, సేన రాహుల్, శ్రీరామ్ యాదవ్, డీజే శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షులు పంతంగి రాజభూపాల్ గౌడ్, అంజన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, వై శ్రీధర్, ఎన్ మల్లారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్ యాదవ్, కొమురయ్య, భాగ్యనగర్ జిల్లా కార్యదర్శి నవీన్ యాదవ్, జోగి రవి, డి లక్ష్మీనారాయణ, ఎస్ విజయ్ కుమార్, అడికే రాజుపాల్గొన్నారు.