calender_icon.png 10 June, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానకొండూర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రూ.200 కోట్లు మంజూరు

12-03-2025 12:54:53 AM

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడి

మనకొండూర్, మార్చి11 (విజయక్రాంతి): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మానకొండూరు నియోజక వర్గం పరిధిలోని యాదవుల పల్లిలో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ప్రెసిడెం ట్ స్కూలుతో సహా రాష్ట్రవ్యాప్తంగా 55 స్కూళ్లకు రూ.11,000 కోట్లు మంజూరు చేసింది.

ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ ఉత్తర్వులు చేసినట్టుగా మానకొండూర్ శాసనసభ్యు డు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు కానున్న సమీకృత గురుకులాల నిర్మాణం కోసం ఒక్కో స్కూల్‌కి రూ.200 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి.

నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 119 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, ఇందులో తొలివిడతగా 55 నియోజక వర్గాల్లో గురుకులాల నిర్మాణం చేపట్టింది. 

వీటిలో అడ్మినిస్ట్రేష్ బ్లాక్, అకాడమిక్ బ్లాక్, స్టాఫ్ క్వార్టర్స్, లైబ్రరీ, క్రీడా ప్రాంగణం, బాలురు, బాలికల హాస్టల్ బ్లాకులు నిర్మిస్థారు. బోధన్, బోధనేతర సిబ్బందికి కూడా  కి నివాస సముదాయాలు ఇందులో ఉంటాయి. ఒక్కో భవనంతి నిర్మాణానికి రూ. 135 కోట్లు , ఇతరత్రా అవసరాలు, పన్నుల కోసం అదనంగా రూ.65కోట్లు వెరసి రూ.200 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది.