calender_icon.png 16 February, 2026 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లయ్యగట్టుపై భక్తజన సందోహం

16-02-2026 12:48:12 AM

రేవల్లి ఫిబ్రవరి 15: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని శానాయిపల్లి మల్లయ్య గట్టు వద్దకు భక్తులతో కిక్కిరిసిపోయింది. శనివారం తెల్లవారు జాము నుంచే భక్తులు కొండపైకి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉం చుకుని ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివనామ స్మరణతో గట్టు మార్మోగిపోయింది. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించగా, స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాయి. సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకు న్నారు.