31-05-2025 12:00:00 AM
నిర్మల్, మే 30 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకునేందుకు పెద్ద సంఖ్య లో తరలివస్తున్నారు.
శుక్రవారం తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కనిపించింది. సామూహిక అక్షరభ్యాసాలు నిర్వహించారు. బాసర ఆలయంతో పాటు గోదావరి పుష్కర ఘాట్లు, బాసర రైల్వే స్టేషన్ భక్తులతో కడికలలాడింది. దైవదర్శనానికి గంటల తరబడి భక్తులు క్యూలో వేచి ఉన్నారు.