calender_icon.png 22 July, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

21-04-2025 08:47:28 AM

అమరాతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత నాలుగు రోజులుగా శ్రీవారి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ నెలకొన్న విషయం తెలిసిందే.  టోకెన్లు లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan ) 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. వెంకన్న దర్శనం కోసం ఏడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. ఆదివారం 82,746 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 25,078 మంది భక్తులుఏడుకొండల వాడికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.