29 March, 2026 | 12:19 AM

కిక్కిరిసిన రోడ్లు.. ఖాళీ లేని బస్సులు

04-11-2024 01:46 AM
  1. పండుగ ముగియడంతో జనం నగర బాట 
  2. సరిపడా బస్సులు లేక ఆగం
  3. టోల్‌గేట్ల వద్ద వాహనాల బారులు 

హైదరాబాద్, నవంబర్ ౩ (విజయక్రాంతి) : దీపావళి పండుగ ముగియడంతో పల్లె జనం పట్నం బాట పట్టారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని రహదారులు కిక్కిరిసి కనిపించాయి. అటు ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు అపసోపాలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో బస్సు టాప్‌పైకి ఎక్కి ప్రయాణించారు. ఆంధ్రా వైపు నుంచి వచ్చే వాహనాలతో విజయవాడ  జాతీయ రహదారి రద్దీగా మారింది. ఆ మార్గంలోని అన్ని టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులుతీరి కనిపించాయి.