6 May, 2026 | 11:27 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణపై సీఎస్ సమీక్ష

17-10-2024 03:52 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గ్రూప్-1 పరీక్షల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం  ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం సమీక్షించారు. ఈనెల 21 నుంచి 27 వరకు జరుగబోయే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ అధికారులకు సూచించారు. గ్రూప్-1 మెయిన్స్ కు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.

ఈనెల 14న టీజీపీఎస్సీ హాల్ టికెట్లను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులతో సీఎం శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఇదిలా ఉండగా.. తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణ వివాదం ముదురుతోంది. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళన చేయడంతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అభ్యర్థులతో గురువారం గాంధీభవన్ లో భేటీ అయ్యారు.