6 July, 2026 | 4:37 PM

Breaking News

ఏటీఎంగా మార్చుకునేందుకే కాళేశ్వరం   •   అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •  

గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణపై సీఎస్ సమీక్ష

17-10-2024 03:52 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గ్రూప్-1 పరీక్షల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం  ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం సమీక్షించారు. ఈనెల 21 నుంచి 27 వరకు జరుగబోయే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ అధికారులకు సూచించారు. గ్రూప్-1 మెయిన్స్ కు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.

ఈనెల 14న టీజీపీఎస్సీ హాల్ టికెట్లను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులతో సీఎం శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఇదిలా ఉండగా.. తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణ వివాదం ముదురుతోంది. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళన చేయడంతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అభ్యర్థులతో గురువారం గాంధీభవన్ లో భేటీ అయ్యారు.