calender_icon.png 11 May, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శన

11-05-2025 12:28:29 AM

శేరిలింగంపల్లి, మే 10: మాదాపూర్‌లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం బెంగళూరు నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారి ణి మేఖల అగ్నిహోత్రి భరతనాట్య నృత్య ప్రదర్శనలో పుష్పాంజలి, నవరస శ్లోకం దరువు వర్ణం, అంతఃపుర గీతం,ఆనంద నటన వంటి అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.

శ్రీదేవి ప్రశాంత్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో  మూషిక వాహన, బ్రహ్మాంజలి, అలరులు కురియగా, బ్రహ్మాంజలి, నారాయణతేయ్, నమఃశివాయ, దశావతార శబ్దం, పలుకే బంగారమయేహ్న, నీలమేఘ శరీర, అదివో అల్లదిగో, కొలువైతివరంగశాయి అంశాలను ఇరా, ఊర్మిళ, గీతికా, చార్వి, దియా, నైనికా, నిషిద్ధ, జాహ్నవి, అనూష, తనుశ్రీ, గోవర్ధిని  మొదలైన వారు ప్రదర్శించారు. అనంతరం కళాకారులందరికి జ్ఞాపికలను అందించి సత్కరించారు.