17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రైతులకు అందుబాటులో జీలుగ విత్తనాలు

09-06-2025 10:08 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని రైతులకు జీలుగ విత్తనాలు సబ్సిడీపై అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి(Mandal Agriculture Officer G Kiranmayi) సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘ భవనాన్ని సోమవారం సందర్శించి మాట్లాడారు. వానాకాలం పంట సీజన్ కు గాను 50% సబ్సిడీలో పచ్చి రొట్టె పైరుకు సంబంధించి జీలుగ విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని, 30 కిలోల బస్తా ధర 2137.50 రూ. ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపి, ఆధార్ జిరాక్స్ కాపి తో  వ్యవసాయ విస్తరణ అధికారిని  సంప్రదించాలని కోరారు. ఆమే వెంట మండల వ్యవసాయ విస్తరణ అధికారి సైండ్ల కనకరాజు పాల్గొన్నారు.