09-06-2025 10:08:35 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని రైతులకు జీలుగ విత్తనాలు సబ్సిడీపై అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి(Mandal Agriculture Officer G Kiranmayi) సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘ భవనాన్ని సోమవారం సందర్శించి మాట్లాడారు. వానాకాలం పంట సీజన్ కు గాను 50% సబ్సిడీలో పచ్చి రొట్టె పైరుకు సంబంధించి జీలుగ విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని, 30 కిలోల బస్తా ధర 2137.50 రూ. ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపి, ఆధార్ జిరాక్స్ కాపి తో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని కోరారు. ఆమే వెంట మండల వ్యవసాయ విస్తరణ అధికారి సైండ్ల కనకరాజు పాల్గొన్నారు.