calender_icon.png 10 June, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలి

09-06-2025 10:12:48 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(Kakatiya University Student Union) ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) పాల్గొన్నారు. ఆదివాసి గిరిజన బిడ్డలపై ఆపరేషన్ కగార్(Operation Kagar) పేరుతో మధ్య భారత ప్రాంతాల్లోని అమాయకపు ఆదివాసీ బిడ్డలను కాల్చి చంపడం దారుణమని ఎమ్మెల్యే అన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు శాంతి చర్చలు జరపాలని డిమాండ్ సమర్ధిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూన్నామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఆపరేషన్ పేరుతో నిజాయితీగా జీవిస్తున్న గిరిజన కుటుంబాలు లక్ష్యంగా మారుతున్నాయి. బీజేపీ ప్రభుత్వానికి ఒకే ఒక్క దౌర్భాగ్యం–ప్రశ్నించే గొంతులను, విభిన్నమైన జీవనశైలిని అణగదొక్కడమే లక్ష్యంగా ఉంది. “కాగర్” అనే పేరు పెట్టుకుని గిరిజనులను లక్ష్యంగా చేసుకోవడం అనేది ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి నిదర్శనం. బీజేపీ ప్రభుత్వానికి గిరిజనుల జీవితాలకు విలువ లేదని, వారు అడవిలో ఉన్నారనే కారణం చేత మారణకాండలో అమాయకులను చంపడం దుర్మార్గమైన ఆలోచన అని మండిపడ్డారు.

“ఆపరేషన్ కాగర్” తక్షణం నిలిపివేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  టిపిసీసీ అధికార ప్రతినిధి కుచన రవళి, కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, యూనివర్సిటీ విద్యార్థి విభాగ నాయకుడు అలువాల కార్తీక్, యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్, పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రమేష్ చందర్, భరత్ బచావో వెంగళ్ రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు శ్రవణ్, మహేష్ , క్రాంతి, భువన్, శివ, మనోహర్, సనత్ జయసూర్య, మనోహర్, శరత్, జున్ను రాజు, అరూరి రంజీత్, హతి రామ్ తదితరులు పాల్గొన్నారు.