గొర్రెల కుంభకోణం కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
12-06-2024 05:05 PM
హైదరాబాద్ : గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో నిందితులకు పోలీసుల కస్టడీ ముగిసింది. ఏసీబీ అధికారులు నిందితులను 3 రోజులపాటు ప్రశ్నించారు. పశుసంవర్థక ఎండీ రాంచందర్, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు తెలిసింది. విచారణ ముగియడంతో నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరచిన అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.






