18-06-2025 09:06:58 PM
హనుమకొండ (విజయక్రాంతి): వర్షాకాలం ప్రారంభంలోనే వరంగల్ కెఎంసి(Warangal KMC)లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రోగులు పోటెత్తుతున్నారు. నరాల బలహీనత, నొప్పులు, తిమ్మిర్లు, తలనొప్పి, తల తిరగడం, నడుము నొప్పి, పక్షవాతం తదితర సమస్యలతో బుధవారం ఒక్కరోజే 500 మంది వరకు రోగులు రావడంతో ఓపి చిట్టిలిచ్చే విభాగం కిక్కిరిసింది. మరోవైపు స్ట్రెచర్ లు సరిపడా లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. ఇదే సమయంలో ఎంజీఎం ఆస్పత్రి నుంచి అత్యవసర చికిత్స కోసం వచ్చిన నలుగురు డయాలసిస్ రోగులను రెండో అంతస్తులోని డయాలసిస్ విభాగానికి తీసుకెళ్లేందుకు స్ట్రెచర్లు గాని, సిబ్బంది గాని లేకపోవడంతో.. ఇలా ఒకే దానిపై నలుగురుని కూర్చోబెట్టుకొని బంధువులే అక్కడికి తీసుకువెళ్లారు.