19-05-2025 05:25:42 PM
నిర్మల్ (విజయక్రాంతి): పట్టణంలోని వైయస్సార్ కాలనీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పుచ్చంపల్లి సుందరరామయ్య వర్ధంతి వేడుకలను నిర్వహించారు. సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు. పేద వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అనేక పోరాటాలు నిర్వహించారని, పార్టీ నాయకులు చూడసం శంభు ప్రకాష్ తదితరులు ఉన్నారు.