15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలపై పోలీసులకు ఫిర్యాదు..

19-05-2025 05:23 PM

ఉట్నూర్ (విజయక్రాంతి): భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్య తీసుకోవాలని ఉట్నూరు బీజేపీ మండల శాఖ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం ఉట్నూర్ ఎస్సైకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉట్నూర్ మండల బీజేపీ అధ్యక్షులు బింగి వెంకటేష్ మాట్లాడుతూ... భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణంలో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పడం జరిగిందన్నారు.

మనదేశ భద్రత కొరకు ఎంతవరకైనా తెగిస్తామని చెప్పడం ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ వైపు చూస్తుంటే, మరి కాంగ్రెస్ నాయకులు మన దేశంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం సిగ్గుచేటు అన్నారు. ఒక భారతదేశ ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేసే స్థాయి మీది కాదని చెప్పి, ఈరోజు ఎవరైతే నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండేరి రమేష్, సిపతి లింగాగౌడ్, బాణావత్ జితేందర్, పందిరి భీమన్న ఉన్నారు.