మైసిగండి ఆలయంలో దీపాదాస్ మున్షీ పూజలు

02-05-2024 12:24:15 AM

రంగారెడ్డి, మే 1(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండి ఆలయంలో కల్వకుర్తి ఎమ్మె ల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్ నుంచి నాగర్‌కర్నూల్ వెళ్తూ మార్గంమధ్యలో మైసిగండి ఆల యం వద్ద ఆగారు. కార్యక్రమంలో టీ పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, నాయకుడు కేశవులు తదితరులు పాల్గొన్నారు.