భారత్ మధ్య రక్షణ ఒప్పందం
01-11-2025 12:16 AM
వ్యూహాత్మక, భద్రతా సహకారం బలోపేతం
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: భారత్ మధ్య 10 ఏళ్ల పాటు రక్షణ ఒప్పందం కుదిరింది. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. మలేషియాలో ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం శుక్రవారం జరిగింది.
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ రక్షణ ఒప్పందంపై ఇరువురు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, భద్రతా సహకారం బలోపేతం కానుంది. ఈ సమావేశం సందర్భంగా పలు కీలక అంశాల గురించి రాజ్నాథ్ సింగ్, హెగ్సేత్ చర్చించుకున్నట్లు తెలుస్తుంది.




