2 July, 2026 | 11:56 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

సాఫ్ట్‌వేర్‌కు రూ.1.87లక్షల టోకరా

01-11-2025 12:18 AM

బెంగళూరు, అక్టోబర్ 31: బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ డెలివరీ స్కామ్‌లో రూ.1.87లక్షలను మోసపోయాడు. అమెజాన్ ద్వారా ఖరీదైన శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయగా, ఒక టైల్ ముక్క డెలివరీ అయ్యింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రేమానంద్ గత నెల 14న అమెజాన్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను తన క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.1.87లక్షలు చెల్లించి, ఆర్డర్ పెట్టాడు.

గత నెల19న డెలివరీ రావడంతో తీసుకున్న అతను, సీల్ ప్యాకేజీని తొలగిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. అందులో స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా టైల్ ముక్కను చూసి, ఆశ్చర్యపోయాడు. ‘నేను రూ.1.87 లక్షల విలువైన శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7ని కొనుగోలు చేశాను. కానీ నాకు దీపావళికి ఒక రోజు ముందు ఫోన్‌కు బదులుగా ఒక రాయి(టైల్) ముక్క వచ్చింది. ఈ సంఘటన నా ఆనందాన్ని, పండుగ స్ఫూర్తిని పూర్తిగా నాశనం చేసింది.

ఆన్‌లైన్‌లో, మరీ ముఖ్యంగా అమెజాన్‌లో కొనుగోలు చేసేటప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని ప్రేమానంద్ కోరాడు. తనకు జరిగిన మోసంపై అతను వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ)లో, కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.