బీజేపీతోనే దేశ రక్షణ

22-04-2024 12:10:00 AM

ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : బీజేపీతోనే దేశానికి రక్షణ అని ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ అన్నారు. జిల్లాలోని తిర్యాణి, కెరమెరి, ఆసిఫాబాద్, వాంకిడి మండలాల బూత్ కమిటీ సభ్యులతో ఆదివారం నిర్వహించిన సమావేశాల్లో ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని గుర్తు చేశారు.

బీజేపీ ఈసారి నాలుగు వందలకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో కూడా కాషాయ జెండా ఎగరేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, జెడ్పీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు, ఆసిఫాబాద్ నియోజవర్గ ఇన్‌చార్జ్ కొట్నాక విజయ్, పార్లమెంట్ కో కన్వీనర్ కిరణ్, అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మితదితరులు పాల్గొన్నారు.