పార్టీ నాగర్కర్నూల్
ఎంపీ అభ్యర్థి మల్లు రవి
నాగర్కర్నూల్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): కాంగ్రెస్తోనే యువతకు బంగారు భవిష్యత్తు సాధ్యమని, లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి పిలుపునిచ్చారు. అచ్చంపేటలో ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ గెలిస్తేనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి స్వగృహంలో పార్టీ ఆదివాసీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి మల్లు రవి మాట్లాడారు. పదేళ్ల పాటు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్కు ఆదివాసీలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. గిరిజనులకు మేలు చేయగలిగేది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఎంపీ అభ్యర్థి వెంట ఎమ్మెల్యే వంశీకృష్ణ, పార్టీ యువజన విభాగ నేత కొడిదెల రాము, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ బెల్లయ్య నాయక్, నాయకులు రఘునాయక్, వాల్యానాయక్, హన్మంతునాయక్, శంకర్నాయక్, గోపాల్నాయక్ పాల్గొన్నారు.