23-09-2025 01:31:58 AM
స్పందించిన ఎన్ ఎమ్ సి కమిషనర్ సాబెర్ అలీ
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ జీపీఆర్ లేఔట్ లో జీరో పర్మిషన్ తో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు సోమవారం కూల్చివేశారు.
గురువారం విజయక్రాంతి దినపత్రికలో ’అక్రమ నిర్మాణాల జోరు’ అనే శీర్షికతో వెలువడిన కథనానికి ఎన్ ఎమ్ సి కమిషనర్ సాబెర్ అలీ స్పందించారు. కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం మున్సిపల్ సిబ్బం ది స్లాబులను కూల్చివేశా రు. మిగతా అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చామని, నోటీసుల సమయం పూర్తయ్యాక వాటిని కూడా కూల్చివేస్తామని కమిషనర్ సాబెర్ అలీ తెలిపారు.