24 February, 2026 | 10:20 PM

అక్రమ నిర్మాణాలు కూల్చివేత

24-02-2026 12:51 AM

అబ్దుల్లాపూర్ మెట్, ఫిబ్రవరి 23: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధి గౌరెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 206 ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రాము తన  సిబ్బందితో కలసి శుక్రవారం ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడ జేసీబీల సహాయంతో కూల్చివేశారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ..  ప్రభుత్వ భూములను ఆక్రమించిన, అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన చట్టపరమైన తీసుకుంటామని హెచ్చరించారు. చట్టానికి ఎవ్వరు అతిథులు కాదని ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రాము, జీపీవో, సిబ్బంది తదితరులు ఉన్నారు.