ఖమ్మంలో హైటెన్షన్.. పేదల ఇండ్లు కూల్చివేత
ఖమ్మం శివారులో ఉద్రిక్తత.. గుడిసెలు తొలగిస్తున్న అధికారులు
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఉద్రిక్తత
హైదరాబాద్: ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతంలోని( Khammam Collectorate) వెలుగుమట్ల భూదాన భూమి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో(Bhoodan Lands) గుడిసెలను అధికారులు తొలగిస్తున్నారు. వెలుగుమట్ల భూదాన్ భూముల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పదేళ్లుగా గుడిసెలు వేసుకుని ఇక్కడే ఉన్నామని పేదలు చెబుతున్నారు. అర్బన్ పార్క్ భూముల్లో(Urban Park Lands) అక్రమంగా ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. భూదాన్ భూములను ప్రభుత్వం ఎవరికీ కేటాయించలేదని పోలీసులు వెల్లడించారు.
ఖాళీ చేయాలని ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చామని అధికారులు పేర్కొన్నారు. వెలుగుమట్ల(Velugumatla) వాసులు విధిలేక వాహనాల్లో సామాన్లు వేసుకుని వెళ్లిపోతున్నారు. అధికారులు నిరాశ్రయిలకు పలుచోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. వెలుగుమట్లలోని 60 ఎకరాల భూదాన్ భూముల్లో(Velugumatla Bhoodan Lands) 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. అధికారులు జేసీబీలతో గుడిసెలను తొలగించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్ళుగా ఇక్కడే బతుకుతున్నామని తమకు పట్టాలు ఇవ్వాలని పేదలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తన ఇల్లును కూల్చేసినందుకు బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కొందరు స్థానికులు జేసీబీలకు అడ్డుగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు.




