రాష్ట్రంలో అభివృద్ధ్ది కుంటుపడింది
చెన్నూర్, ఏప్రిల్ 19: కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మాజీ ఎంఎల్ఏ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ అన్నారు. ఆదివారం చెన్నూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరికల సందర్భంగా ఆయన మాట్లాడారు.
చెన్నూర్ నియోజక వర్గంలో అయితే అభివృద్ది జాడే మరచినట్లయిందని మంత్రి వివేక్ రైతాంగ, మహిళల సమన్యలు, సింగరేణి కార్మికులకు చేయాల్సిన పనులను, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లాంటివాటిని పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విఫలంతోనే నాయకులు బీఆర్ఎస్ బాట పడుతున్నారన్నారు. ప్రజలందరు కేసీఆర్ ప్రభుత్వం రాక కోసం ఎదురుచూస్తున్నారన్నారు. అనంతరం చెన్నూర్ 16వ వార్డు మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేష్ తో పాటు చింతలగూడెం, కొత్తగూడెంల నుంచి వచ్చిన ఆయన అనుచరులకు బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.






