24 March, 2026 | 3:23 AM

తండాల్లో అభివృద్ధిని విస్మరించారు

25-07-2024 12:31 AM

ఎమ్మెల్యే వంశీకృష్ణ 

తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని మాత్రం విస్మరించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ విమర్శించారు. కేవలం నెంబర్ కోసమే ఒక తండాను విభజించి రెండు గ్రామాలుగా చేశారని ఆరోపించారు. ఆశాస్త్రీయంగా తండాలను గ్రామాలుగా చేశారని, వాటికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న హామీ బీఆర్‌ఎస్ ఎన్నికల కోసమే ఇచ్చిందని ఆరోపించారు.