27-12-2025 09:25:53 PM
- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర మండలం ఆచంపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఆరె తేజశ్రీ రాజశేఖర్, చిన్నచంపల్లి సర్పంచ్ గుడి రజిని ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యే సత్యం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.