28 March, 2026 | 5:24 PM

Breaking News

మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •  

అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా

02-07-2024 05:51 AM
  • డిప్యూటీ సీఎం భట్టి 

ఖమ్మం, జూలై 1(విజయక్రాంతి): మధిరలో అభివృద్ధిని పరుగులు పెట్టించి, మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని, దీనికి ప్రతీ ఒక్కరు కంకణబద్దులవ్వాలని డీప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మధిరలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మధిరకు త్వరలోనే ఐటీ హబ్ రానుందని, ఇందుకు కావల్సిన భూమిని సిద్ధం చేశామన్నారు.

పారిశ్రామిక సంస్థలను కూడా మధిరలో నెలకొల్పనున్నట్లు తెలిపారు. సిరిపురం గ్రామ సమీపంలోని ఎండ్రపల్లి గుట్టల వద్ద ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు త్వరలోనే భూమిపూజ నిర్వహిస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన యువకులు ముందుకు వస్తే ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం నుంచి రాయితీలు కల్పిస్తామన్నారు.