28-05-2025 12:00:00 AM
ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష
సమస్యలపై వినతిపత్రాలు అందజేసిన కార్పొరేటర్లు
ఎల్బీనగర్, మే 27 : అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని, ఇంకా ప్రారంభించని పనులను వెంటనే ప్రారంభించాలని, అ ధికారులు నిర్లక్ష్యం వీడి పనులను నిరంతరం పర్యవేక్షించాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై కార్పొరేటర్లు, అధికారులతో సమావే శమై సమీక్షించారు.
డివిజన్ల అభివృద్ధికి ప్ర భుత్వం నిధులు కేటాయించిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి డివిజన్ కు భారీగా నిధులు మంజూరు చేసినట్లు మే యర్ విజయలక్ష్మి తెలిపారు. ప్రజలకు కావాల్సిన కనీస, మౌలిక వసతులు, సదుపా యాలు కల్పించాలని సూచించారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో డ్రైనేజీ పనులు, వరద కాలువ పనులను వెంటనే పూర్తి చే యాలని ఆదేశించారు.
సమావేశంలో ఆ యా డివిజన్లలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు వివరించారు. నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ మాట్లాడుతూ.. నాగోల్ చెరువును అభివృద్ధి చేసి, రోల్ మో డల్ గా తీర్చిదిద్దాలన్నారు. నాగోల్ డివిజన్ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని కోరారు. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ మాట్లాడుతూ...
హస్తినాపురం డివిజన్ పరిధిలో ఎస్ఎన్ డీపీ పనులు నత్తన డకన జరుగుతున్నాయని, ఏపీ ఎస్సీబీ కాలనీ నుంచి బైరామల్గూడ చెరువు వరకు జరుగుతున్న పనులు నత్త నడకన సాగుతున్నాయని తెలిపార. వందనపురి కాలనీ నుంచి కేకే గార్డెన్ వరకు, ద్వా రకా నగర్ నుంచి డీఆర్డీఎల్ కాలనీ వర కు పనులను ఇంకా ప్రారంభించలేదన్నారు. బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి మాట్లాడుతూ..
డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో సీసీ రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయాలని, శివారు కాలనీ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కాలనీల్లో ఖాళీగా ఉన్న పార్కు స్థ లాలు కబ్జాకు గురికాకుండా ప్రహరీల నిర్మాణానికి నిలు మంజూరు చేయాలన్నారు. వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... వనస్థలిపురం డివి జన్ కాలనీల్లో రోడ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటు, డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించడంతోపాటు పా ర్కు స్థలాలను కాపాడాలని కోరారు.
కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ మాట్లా డుతూ.. కొత్తపేట డివిజన్ పరిధిలో సీసీ రోడ్లను మంజూరు చేయాలన్నారు. ముంపు సమస్య పరిష్కారానికి బాక్స్ డ్రైనేజ్లు నిర్మించాలని కోరారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి మాట్లాడుతూ... ఈస్ట్ జోన్లో వసూలు చేస్తున్న రూ, 700 కోట్లు పన్ను రాబడి ఆదాయా న్ని స్థానిక డివిజన్ల అభివృద్ధికి, సమస్యల ప రిష్కారానికి మాత్రమే కేటాయించాలన్నారు.
మన్సూరాబాద్, హయత్నగర్ శివారు కాలనీల్లో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులు, మంచినీటి పైప్ లైన్లు తదుపరి వసతులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, కాలనీల్లో పార్కు స్థలాలు కబ్జా కాకుండా చూడా లని కోరారు. మన్సూరాబాద్ పెద్ద చెరువు లోకి మురుగు కలవకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సమీక్షలో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డిప్యూటీ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.