11 July, 2026 | 2:17 PM

Breaking News

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్లు   •   మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •  

ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్

11-07-2026 01:43 PM

ట్రిపుల్ రైడింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన ప్రభుత్వ సిబ్బంది..

చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

మల్దకల్, జూలై 11: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ ధరణి కంప్యూటర్ ఆపరేటర్ ద్విచక్ర వాహనంపై మరో ఇద్దరితో కలిసి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళ్లిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికుల కథనం ప్రకారం, మల్దకల్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌కు సంబంధించిన సేవలు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ మరో ఇద్దరితో కలిసి ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ కెమెరాకు చిక్కారు.

ప్రజలకు చట్టాలను పాటించాల్సిన అవసరాన్ని చెప్పాల్సిన ప్రభుత్వ కార్యాలయ సిబ్బందే ట్రాఫిక్ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే ఈ-చలాన్లు విధిస్తున్న అధికారులు, ప్రభుత్వ సిబ్బంది విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నిబంధనలు ఉల్లంఘించిన వారెవరైనా ఒకే ప్రమాణాలు వర్తించాలని అభిప్రాయపడుతున్నారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్

సంబంధిత ద్విచక్ర వాహనం వివరాల ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఘటనపై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే, ఘటనలో వాస్తవాలు నిర్ధారణ అయితే సంబంధిత అధికారుల ద్వారా శాఖాపరమైన చర్యలను కూడా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.