25 April, 2026 | 2:41 PM

డయాలసిస్ కేంద్రాలు కావాలి

05-11-2024 12:00 AM

నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి దామోదర రాజనరసింహ తాజాగా ప్రారంభిస్తుండడం ప్రయోజనదాయకం. నిజానికి గ్రామీణ స్థాయిలో ప్రతీ ఆరోగ్య కేంద్రంలో ఇలాంటి కేంద్రాల అవసరం చాలా ఉంది. అనేకమంది డయాలసిస్ కోసం హైదరాబాద్ వంటి నగరాల వరకు వస్తుంటారు. కనీసం ప్రతీ మండల కేంద్రంలో వీటిని ఏర్పరచడానికి ప్రభుత్వం చొరవ చూపాలి. శ్రీనాథ్ కులకర్ణి, నర్సాపూర్