calender_icon.png 22 June, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి రామాలయంలో డిజిటల్ సేవలు ప్రారంభం

21-06-2025 11:12:42 PM

ప్రారంభించిన దేవస్థానం ఈవో ఎల్ రామాదేవి 

భద్రాచలం (విజయక్రాంతి): శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం శనివారం డిజిటల్ సేవలు ప్రారంభించారు. ఫెడరల్ బ్యాంక్ వారు దేవస్థానానికి సమర్పించిన క్రియాస్క్ మిషన్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలుత ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి(Temple EO Ramadevi) మిషన్ ను ప్రారంభించారు. ఆ తర్వాత అనేకమంది భక్తులు కియాస్క్ మిషన్ ఉపయోగించి తమకు కావాల్సిన ప్రసాదాలను పొంది, ఈ సేవ చాలా ఉపయోగంగా ఉన్నదని అన్నారు. నిమిషంలోపే మేము టోకెన్ పొంది ప్రసాదం స్వీకరించే విధంగా ఉండటంతో సమయం కూడా ఆదా అయిందని భక్తులు ఈ సందర్భంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలయ ఈఈ రవీంద్రనాథ్, ఏ ఈ ఓ భవాని రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.