17 April, 2026 | 2:12 AM

ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి

22-06-2025 12:00 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ 14వ వర్ధంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్‌రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డితో కలిసి తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. “ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది రాయి వేయడంలో విశేష కృషి చేశారు. ఆయన త్యాగాలు, సేవలు మనకు స్ఫూర్తిదాయకం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన ఉద్యమం తరం తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది” అని అన్నారు.