calender_icon.png 23 June, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోయగూడెం ఓసీలో పర్యటించిన డైరెక్టర్

23-06-2025 01:19:42 AM

టేకులపల్లి, జూన్ 22 (విజయక్రాంతి): సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ & ప్లానింగ్) కే. వెంకటేశ్వర్లు ఆదివారం ఇల్లందు ఏరియా లోని కోయగూడెం ఓ.సీ లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన పని స్థలాలను సం దర్శించి అక్కడ జరుగుచున్న పనులను పరిశీలించారు. రోజు వారి బొగ్గు ఉత్పత్తి, రవా ణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జి.యం వి.కృష్ణయ్యని అడిగి తెలుసుకున్నా రు.

తరువాత డైరెక్టర్ (పి.పి) కే. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వర్షాకాలంలో ఎదురైయ్యే సమస్యలను గురించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజు వారి లక్ష్యాలను అధికమించి రవాణా కు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని, అలాగే బొగ్గు నాణ్యత సామర్థ్యం పెంచే జి.13 బొగ్గు ఉత్పతి ఐయే లాగా చూడాలని అలాగే ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి తీయాలని అన్నారు.

ఈ కార్యక్రమం లో కేవోసి పి.ఓ గోవింద రావు, మేనేజర్ శ్రీనివాస్, క్వాలిటీ మేనేజర్ రాందాస్, ఏరియా సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.