23-06-2025 01:17:55 AM
- వరంగల్, ములుగు సమీకృత కార్యాలయాలను త్వరలో ప్రారంభించుకుంటాం
- నిర్మాణం చివరి దశలో ఉన్న ఆర్వోబీలు, మెడికల్ కాలేజీలు, టిమ్స్పై దృష్టి
- ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): రోడ్లు భవనాల శాఖ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివా లయంలో ఆర్అండ్బీ అధికారులతో మం త్రి సమీక్ష నిర్వహించారు.
రోడ్లు భవనాల శాఖపై బృహత్తర బాధ్యత ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చివరిదశలో ఉన్నవాటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. పెండింగ్లో ఉన్న 5 జిల్లా సమీకృత కార్యాలయాలైన ఆదిలాబాద్, వరం గల్, ములుగు, నారాయణపేట, కరీంనగర్ పనుల పురోగతిపై మంత్రి ఆరా తీయగా పెండింగ్ బిల్లుల అంశం అధికారులు మం త్రి దృష్టికి తీసుకెళ్లారు.
పనులు చివరి దశ లో ఉన్న వరంగల్, ములుగు జిల్లా కలెక్టరేట్లు వెంటనే పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని, త్వరలో ప్రారంభించుకుందామని మంత్రి చెప్పారు. నిజామాబాద్ మాధ వనగర్ ఆర్వోబీ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు.
నిర్మాణం చివరి దశలో ఉన్న ఆర్వోబీలు, మెడికల్ కాలేజీలు, టిమ్స్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. వర్క్ ఏజెన్సీలకు, కాంట్రాక్టర్ల పెం డింగ్ బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మా ట్లాడి క్లియర్ చేయిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. సమీక్షలో ఈఎన్సీ తిరుమల, చీఫ్ ఇంజినీర్లు మోహన్నాయక్, రాజేశ్వర్రెడ్డి, లక్ష్మణ్ పలువురు అధికారులు పాల్గొన్నారు.