8 May, 2026 | 3:01 PM

Breaking News

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన.. ఉర్దూ పోస్టర్‌ ఆవిష్కరణ   •   తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో ప్రాణహిత జలాలకు వినియోగం: మంత్రి జూపల్లి కృష్ణారావు   •   పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత   •   పుల్లాయిగూడెం నూతన రామాలయం ప్రారంభోత్సవం   •   కొడంగల్‌లో శ్రీవేంటేశ్వర స్వామి ఆలయానికి సీఎం భూమిపూజ   •   జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య   •   ఎస్ పీఎల్ క్రికెట్ విజేతకు లక్ష నగదు, ట్రోఫీ అందజేత   •   రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు   •   వేసవి శిబిరం సద్వినియోగం చేసుకోగలరు: ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి   •   కొలనూరు చెరువు వద్ద రైతు వారోత్సవాలు నిర్వహణ   •  

దివ్యాంగులను ప్రోత్సహించాలి

03-12-2024 07:57 PM

సింగరేణి ఏరియా జిఎం దేవేందర్... 

మందమర్రి (విజయక్రాంతి): దివ్యాంగులను క్రీడలతో పాటు అన్నిరంగాలలో ప్రోత్సహించాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ జి. దేవేందర్ కోరారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని మనో వికాస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల్లో నిగూడమైన శక్తి దాగి ఉంటుందని దాన్ని వెలికి తీసి వారిని ప్రోత్సహించాలని కోరారు. అంతర్జాతీయ  దివ్యాంగుల దినోత్సవాన్ని దివ్యాంగుల సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎంతో ఓపికతో  శ్రమకు ఓర్చి మనో వికాస్  పిల్లలకు చదువు చెప్పడం, కొన్ని పనులలో నేర్పరులుగా తీర్చిదిద్దడం అబినందనీయమన్నారు.

మనో వికాస్ స్కూల్ పిల్లలకు సింగరేణి ఉద్యోగుల సహకారం మరువలేనిదని, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ పడుతున్నవారికి, విద్యా బుద్దులు నేర్పుతున్న ఉపాద్యాయులు, ఆయాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డివైపిఎం ఎండి ఆసిఫ్, మనోవికాస్ స్పెషల్ స్కూల్ ఇంచార్జ్ టి సురేఖ, పేరెంట్స్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ టి రాజలింగు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.