22-06-2025 01:11:54 PM
మహబూబాబాద్, (విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దరిచేరకుండా కాపాడుకోవచ్చు అని మున్సిపల్ అధికారులు(Municipal officials) ప్రజలకు అవగాహన కల్పించారు. వందరోజుల కార్యాచరణలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బల్దియా పరిధిలో మున్సిపల్ ఆఫీస్ నుండి ధనసరి వరకు ఇంటింటికి తిరిగి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయడం, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
వర్షాకాలంలో ఇంటి ఆవరణలో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత టైర్లు, కొబ్బరి బోండాలు, ఇతర ప్లాస్టిక్, వివిధ రకాల వస్తువుల్లో వర్షం నీరు నిలవకుండా చూసుకోవాలని తెలిపారు. దోమల వ్యాప్తి చెందకుండా పరిసరాలను పూర్తిగా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల, దోమకారక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ వార్డ్ అధికారులు, ఆర్పీలు, మెప్మా సభ్యులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.