11-06-2025 11:12:06 PM
మణికొండ: మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. సెక్రటేరియట్ దగ్గరలోని బీఆర్ కే భవన్ కు కేసీఆర్ వెళ్లిన సమయంలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ ఛార్జ్ యువ నాయకుడు కార్తీక్ రెడ్డి ఆదేశాలతో బుధవారం బీఆర్ఎస్ పార్టీ మణికొండ మునిసిపాలిటీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మణికొండ మునిసిపాలిటీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా లీడర్స్, పార్టీ అభిమానులు, కార్యకర్తలందరు కలసి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క విశిష్టతను తెలియజేసే ప్ల కార్డులను ప్రదర్శించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ జరుపుతున్న బీఆర్ కే భవన్ వద్దకు వీళ్లంతా తరలివెళ్లారు.