11-06-2025 11:15:48 PM
ధర్మారం పర్యటనలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
పెద్దపల్లి (విజయక్రాంతి): ప్రమాదంలో మరణించిన గొర్రెలకు వేగవంతంగా పరిహారం అందేలా కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(State SC and ST Welfare Minister Adluri Laxman Kumar) అన్నారు. బుధవారం రాత్రి ధర్మారం మండలంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha)తో కలిసి పర్యటించారు. ధర్మారం మండలం చామనపల్లి గ్రామంలో నిన్న విద్యుత్ ప్రమాదవశాత్తు 8 మంది గొర్రెల యజమానులకు చెందిన 58 గొర్రెలు చనిపోయిన సంఘటన తెలుసుకున్న మంత్రి సంబంధిత రైతులను, వారి కుటుంబాలను పరామర్శించారు.
ప్రతి గొర్రె కు 7000 రూపాయల చొప్పున విద్యుత్ శాఖ నుంచి పరిహారం వేగవంతంగా అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సంబంధించిన శాఖ వారితో మంత్రి, కలెక్టర్ మాట్లాడి సంబంధిత గొర్రెల యజమానులకు పరిహారం వేగవంతంగా అందేలా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ధర్మారం మార్కెట్ యార్డులో ఇటీవల మరణించిన హమాలీ కుటుంబానికి జిల్లా కలెక్టరేట్ నుంచి 2 లక్షల రూపాయలు, సంబంధిత వ్యవసాయ సహకార సొసైటీ నుంచి 3 లక్షలు మొత్తం 5 లక్షలు విలువగల చెక్కులను మంత్రి, కలెక్టర్ అందించారు. ఈ పర్యటనలో మంత్రివెంట ఏం సి చైర్మన్ రూప్లా నాయక్, పాక్స్ చైర్మెన్ బలరాం రెడ్డి, డిసిఓ శ్రీ మాల, డీఎంవో ప్రవీణ్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్సీ మాధవరావు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి శంకర్, సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.