17 April, 2026 | 3:22 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పేద విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

22-04-2025 04:56 PM

కాలినడక తప్పించిన మిడ్ వెస్ట్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, గూడూరు మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు మిడ్ వెస్ట్ కంపెనీ(Midwest Group of Companies) సైకిళ్లను సమకూర్చింది. కేసముద్రం మండలం కేసముద్రం స్టేషన్, కల్వల ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 110 మంది విద్యార్థినులకు 6.17 లక్షల రూపాయల వ్యయంతో సైకిళ్లను అందజేసింది. అలాగే కేసముద్రం స్టేషన్, కల్వల, వెంకటగిరితో పాటు నాయకపల్లి ప్రభుత్వ పాఠశాలలకు 3.60 లక్షల వ్యయంతో సమకూర్చిన రెండేసి కంప్యూటర్లను అందజేశారు.

అలాగే 2.25 లక్షల వ్యయంతో సమకూర్చిన 50 బెంచిల్లో వెంకటగిరి పాఠశాలకు 15, నాయక పెళ్లి పాఠశాలకు 35 అందజేశారు. ఈ సందర్భంగా వినయంధర్ రెడ్డి మాట్లాడుతూ.. పేద విద్యార్థులు సరైన రవాణా సౌకర్యం లేక ప్రతిరోజూ కాలినడకన పాఠశాలకు వస్తుండడంతో ఆలస్యం జరిగి విద్యాభ్యాసానికి ఆటంకం అలుగుతుండడంతో తమ సంస్థ ముఖ్యంగా విద్యార్థినులకు సైకిళ్లను సమకూర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడ్ వెస్ట్ అకౌంట్స్ మేనేజర్ గౌండ్ల మల్లయ్య, మేనేజర్ (హెచ్ ఆర్) రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.