17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

14-04-2025 01:46 AM

బాన్సువాడ, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని  నసురుల్లాబాద్ మండలానికి చెందిన డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణ బిల్లు చెక్కులను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హాయంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అప్పు తెచ్చుకున్న డబ్బులతో ఇండ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తానని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పడంతో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు డబ్బులు ప్రభుత్వం మంచి రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించి చెక్కులు పంపి నీ చేసినట్లు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలోని  నసురుల్లాబాద్ మండ లానికి చెందిన నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి( CMRF ) చెక్కులను లబ్ధిదారులకు పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలోని పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద నస్రుల్లాబాద్ మండల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల స్థానిక ప్రజాప్రతిని ధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులుపాల్గొన్నారు.