22 May, 2026 | 10:27 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

30-03-2026 06:25 PM

బిక్కనూరు,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా బిక్కనూరు మండలంలోని లక్ష్మీదేవిపల్లె, ర్యాగట్లపల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, DCC సెక్రటరీ లింగాల రాజా బాబు గౌడ్, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ పాల్గొన్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆరు కుటుంబాలకు చెక్కులను నేరుగా వారి ఇళ్ల వద్దకే అందజేశారు. పుల్లూరి భారతి (₹41,000), మగిని ఎల్లయ్య (₹60,000), నాగన్నాగరి సావిత్రి (₹60,000)లకు సాయం అందించారు. ప్రభుత్వం నేరుగా ఇంటి వద్దకు వచ్చి సాయం చేయడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.