19-09-2025 12:42:01 AM
హాజరైన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సెప్టెంబర్ 18:(విజయ క్రాంతి):వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 110 మందికి 22,29,500 రూపాల విలువ గల చెక్కులను నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పంపిణీ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, అత్యవసర ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయ నిధి పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్ధిక భరోసా లభిస్తుందని సందర్భంగా ఆయనఅన్నారు.
తన నియోజకవర్గంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం పొందలేని పరిస్థితిలో ఉంటే, వారికి ఈ పథకం ద్వారా ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నాట్లు ఆయన తెలిపారు.ఇప్పటి వరకు అనేకమందికి సీఎంఆర్ఎఫ్ నిధులు మం జూరు చేయించామని, అర్హులైన ప్రతిఒక్కరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుం టామన్నారు.
సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అప్లై చేసుకున్న ప్రతి లబ్ధిదారుని దరఖాస్తులను సెక్రటరేట్ కి పంపించడం జరుగుతుందని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్న మొత్తంలో 15%, 20% మాత్రమే చెల్లిస్తుందని లక్షల్లో ఖర్చు ఉంటే 15వేలు, 20వేలు ఇస్తే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్ధిక భారంగా మారుతుందని అన్నారు.
బాధితులు అప్లై చేసుకున్న మొత్తంలో 50% ప్రభుత్వం చెల్లించేల చర్యలు తీసుకోవలని డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యావంతమైన మహిళలను తీర్చిదిద్దే లక్ష్యంతో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పోషన్ మహా ధ్వరా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషక పదార్ధాలను కేంద్రం అందిస్తుందని తెలిపారు. బిజెపి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.