పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
23-06-2026 04:04 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మండలంలోని రఘునాథ పాలెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎన్టీయల్ సంస్థ ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం విద్యార్థులకు పలకలు,హ్యాండ్ రైటింగ్ నోట్ బుక్స్,బ్యాగులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సామ్యూల్,హెచ్ఎం సురేశ్,ఎన్టీయల్ సంస్థ ప్రతినిధులు అనేష్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






